‘‘నిత్యామీనన్ యాక్టింగ్ చూస్తే చాలా ముచ్చటేస్తుంది. ఆమె తెలుగు తెరకు పరిచయం కావడం మన అదృష్టం. నిత్యను తెలుగు సినిమాకు దొరికిన మరో సౌందర్య అనొచ్చు’’ అని విజయనిర్మల అన్నారు. నిత్యామీనన్ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న చిత్రం ‘మాలిని 22’. సీనియర్ నటి శ్రీప్రియ దర్శకత్వంలో రాజ్కుమార్ సేతుపతి తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అరవింద్-శంకర్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్లో విడుదల చేశారు.
సూపర్స్టార్ కృష్ణ ఆడియోసీడీని ఆవిష్కరించి తొలి ప్రతిని రానాకు అందించారు. ప్రచార చిత్రాలను విజయనిర్మల విడుదల చేశారు. ఈ సందర్భంగా విజయనిర్మల మాట్లాడుతూ -‘‘తెలుగులో లేడీ డెరైక్టర్లు చాలా తక్కువ. ఇప్పుడిప్పుడే లేడీ డెరైక్టర్ల సంఖ్య పెరుగుతోంది. శ్రీప్రియ తెలుగు సినిమాకు దర్శకత్వం వహించడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు. నాటి తమ సహనటి శ్రీప్రియ దర్శకురాలిగా మారడం ఆనందంగా ఉందని జయసుధ చెప్పారు. చక్కని సందేశం ఉన్న సినిమా ఇదని సీనియర్నటి లత అన్నారు.
నిత్యామీనన్ని లేడీ కమల్హాసన్గా నటుడు నరేష్ అభివర్ణించారు. ‘‘సమాజంలోని ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. నిత్య నటన అద్భుతం’’ అని శ్రీప్రియ తెలిపారు. నిత్యామీనన్ మాట్లాడుతూ -‘‘సినిమా పట్ల శ్రీప్రియగారికున్న పేషన్, కన్విక్షన్ నచ్చి ఈ పాత్ర చేయడం కష్టమని తెలిసి కూడా చేయడానికి అంగీకరించాను. సమాజంలో స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. వాణిజ్య అంశాలతో పాటు, మంచి సందేశం కూడా ఉన్న సినిమా ఇది’’ అన్నారు. కచ్చితంగా అందరికీ నచ్చే సినిమా ఇదని నిర్మాత రాజ్కుమార్ సేతుపతి నమ్మకం వ్యక్తం చేశారు. ఇంకా చిత్రం యూనిట్ సభ్యులందరూ మాట్లాడారు.
సూపర్స్టార్ కృష్ణ ఆడియోసీడీని ఆవిష్కరించి తొలి ప్రతిని రానాకు అందించారు. ప్రచార చిత్రాలను విజయనిర్మల విడుదల చేశారు. ఈ సందర్భంగా విజయనిర్మల మాట్లాడుతూ -‘‘తెలుగులో లేడీ డెరైక్టర్లు చాలా తక్కువ. ఇప్పుడిప్పుడే లేడీ డెరైక్టర్ల సంఖ్య పెరుగుతోంది. శ్రీప్రియ తెలుగు సినిమాకు దర్శకత్వం వహించడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు. నాటి తమ సహనటి శ్రీప్రియ దర్శకురాలిగా మారడం ఆనందంగా ఉందని జయసుధ చెప్పారు. చక్కని సందేశం ఉన్న సినిమా ఇదని సీనియర్నటి లత అన్నారు.
నిత్యామీనన్ని లేడీ కమల్హాసన్గా నటుడు నరేష్ అభివర్ణించారు. ‘‘సమాజంలోని ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. నిత్య నటన అద్భుతం’’ అని శ్రీప్రియ తెలిపారు. నిత్యామీనన్ మాట్లాడుతూ -‘‘సినిమా పట్ల శ్రీప్రియగారికున్న పేషన్, కన్విక్షన్ నచ్చి ఈ పాత్ర చేయడం కష్టమని తెలిసి కూడా చేయడానికి అంగీకరించాను. సమాజంలో స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. వాణిజ్య అంశాలతో పాటు, మంచి సందేశం కూడా ఉన్న సినిమా ఇది’’ అన్నారు. కచ్చితంగా అందరికీ నచ్చే సినిమా ఇదని నిర్మాత రాజ్కుమార్ సేతుపతి నమ్మకం వ్యక్తం చేశారు. ఇంకా చిత్రం యూనిట్ సభ్యులందరూ మాట్లాడారు.